IND VS ENG : దెబ్బతిన్న భారత్‌ ఎలా దెబ్బకొడుతుందో తెలుసు! Kohli ని గమ్మునుంచాలి || Oneindia Telugu

Oneindia Telugu 2021-09-01

Views 286

England vs India: Have to keep Virat Kohli quiet if we want to win this series, says Joe Root
#INDvsENG4thTest
#TeamIndia
#ViratKohli
#OvalCricketGround
#JoeRoot
#serieswin


సొంతగడ్డపై భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ గెలవాలంటే ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని అడ్డుకోవాలని ఇంగ్లండ్ సారథి జోరూట్ అన్నాడు. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా ఆ పని చేశామని, మిగతా మ్యాచ్‌ల్లో కూడా దాన్ని కొనసాగించాలన్నాడు. ఇక వరల్డ్ బెస్ట్ ప్లేయర్ అని కోహ్లీని త్వరగా ఔట్ చేయడంలో తమ పేసర్లదే కీలక పాత్రని కొనియాడాడు. సెప్టెంబర్ 2(గురువారం) నుంచి ఓవల్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనున్న నేపథ్యంలో జోరూట్ మంగళవారం మీడియాతో మాట్లాడాడు. కోహ్లీని ఎంత గమ్మునుంచితే తమ జట్టు అంత మంచిదన్నాడు. ఇక దెబ్బతిన్న భారత జట్టు నాలుగో టెస్ట్‌కు ఎలా సిద్దమవుతుందో తమకు తెలుసన్నాడు. అందుకే మూడో టెస్ట్‌లో గెలిచామని ఎక్కడా రిలాక్స్ కావడం లేదని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS