Dr. Shivakumara Swamy, the 111-year-old seer of Siddaganga Mutt,is no more,on Monday at the Mutt in Tumakuru.
#DrShivakumaraSwamy
#SiddagangaMuttSeer
#Tumakuru
#karnataka
కర్ణాటకలోని సిద్ధగంగ మఠంలో 111 ఏళ్ల శివకుమార స్వామీజీ శివైక్యం చెందడంతో ఆ రాష్ట్రంలో విషాదం అలుముకుంది. వయసు మీదపడటం, అనారోగ్యం కారణంగా స్వామీజీ సిద్ధగంగ, మఠం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలియగానే... కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఇతర ముఖ్య నేతలు మంగళవారం తమ రెగ్యులర్ షెడ్యూల్ కార్యక్రమాల్ని వాయిదా వేసుకుని సిద్ధగంగ స్వామి మఠానికి బయలుదేరి వెళ్లారు. మూడు రోజులు సంతాప దినాలుగా తెలిపిన ప్రభుత్వం మంగళవారం అధికారిక సెలవుగా ప్రకటించింది.