India vs Bangladesh : Suresh Raina third Indian batsman to hit 50 sixes in T20I

Oneindia Telugu 2018-03-09

Views 67

Indian batsman Suresh Raina has become the third Indian cricketer to hit 50 sixes in T20I cricket. Only Rohit Sharma (69) and Yuvraj Singh (74) have hit more sixes than Raina among Indians.
నిదాహాస్ ట్రోఫీలో భాగంగా గురువారం బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రైనా 27 బంతుల్లో ఒక సిక్సు, ఒక ఫోర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.

దీంతో ఈ మ్యాచ్‌లో సిక్సు బాదడంతో టీ20ల్లో 50 సిక్సులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన మూడో భారత ఆటగాడిగా సురేశ్ రైనా నిలిచాడు. ఈ జాబితాలో 74 సిక్సులతో యువరాజ్‌ తొలి స్థానంలో ఉండగా.. రోహిత్‌ శర్మ(69) సిక్సులతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఆ తర్వాతి స్థానాల్లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని (49), విరాట్ కోహ్లీ (41) సిక్సులతో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, మొత్తంగా చూస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో క్రిస్‌ గేల్‌, మార్టిన్‌ గప్టిల్‌లు 103 సిక్సులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. కాగా, బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే.

Share This Video


Download

  
Report form