Amaravati ORR Updates : రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ త్వరలో కార్యరూపం దాల్చబోతోంది. రూ.25,000ల కోట్ల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టు భూసేకరణ కోసం కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్హెచ్ఐ అధికారులు లేఖలు రాశారు. ప్రాజెక్టు అలైన్మెంట్, డీపీఆర్లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడాదిలో ఓఆర్ఆర్ పనులు ఆరంభించే వీలుందని అధికారులు చెబుతున్నారు.