వివేకా హ‌త్య కేసులో కొత్త కోణాలు..! | Oneindia Telugu

Oneindia Telugu 2019-03-19

Views 1.5K

వైయస్ వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ హ‌త్య వెనుక రూ. 125 కోట్ల సెటిల్మెంట్ వ్యవహారంలో వచ్చిన వివాదమే కారణమని సిట్ అధికారులు భావిస్తున్నారు. హత్య కేసులో దర్యాఫ్తును ముమ్మరం చేసిన అధికారులు, మొత్తం వ్యవహారమంతా ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డిల చుట్టూనే ఉందని భావిస్తున్నారు. వారు నోరువిప్పితే మొత్తం బయటకు వస్తుందని చెబుతున్నారు.వివేకానంద రెడ్డి హత్యకు రెండు వారాల ముందే రెక్కీ జరిగిందని, బెంగళూరులోని ఓ భూ వివాదంలో వివేకా, గంగిరెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయని అనుమానిస్తున్నారు. ఈ డీల్ కు సంబంధించి రూ. 1.50 కోట్ల లావాదేవీలపై సిట్ ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. డీల్ లో తాము నష్టపోకూడదన్న ఉద్దేశంతో గంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి చేతులు కలిపారని, వి వేకా హత్యకు నాలుగు రోజుల ముందు పెంపుడు కుక్కను హత్య చేసిన విష‌యం ఇప్ప‌టికే వెలుగు లోకి వ‌చ్చింది.
#ysvivekanandareddy
#pulivendula
#kadapa
#sp
#Parameswarreddy
#Gangireddy
#andhrapradesh
#ysjagan
#RahulDevSharma
#Laboratory
#Letter
#Chandrababu

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS