DP MP CM Ramesh Indefinite fast called off on the presence of Andhra Pradesh CM Chandrababu Naidu.
#cmramesh
#chandrababunaidu
#naralokesh
#kadapa
#steelplant
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీ సీఎం రమేశ్ చేస్తోన్న ఆమరణ నిరాహారదీక్ష 11వ రోజుకు చేరిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శనివారం ఆయనను పరామర్శించారు. కాగా, ఎంపీ రమేష్కి రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు వెల్లడించారు. సీఎం పరామర్శించేందుకు రావడంతో దీక్షతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ బీటెక్ రవిని పార్టీ నేతలు దీక్షాస్థలికి తీసుకొచ్చారు. రవిని కూడా సీఎం పరామర్శించారు.
సీఎం రమేష్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. ఓ ఎంపీ ఆమరణ దీక్ష చేస్తుంటే పట్టించుకోరా? అని కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.