పవన్ నిన్న పొగిడారు,నేడు విమర్శిస్తున్నారు,మరి రేపు ఏం చేస్తాడో!!

Oneindia Telugu 2018-06-05

Views 871

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu Nava Nirmana Deeksha in Visakhapatnam.
#chandrababunaidu
#navanirmanadeeksha
#pawankalyan

వచ్చే ఎన్నికల్లో కుట్రదారులైన బీజేపీని, పాత్రధారులైన వైయస్సార్ కాంగ్రెస్, జనసేనలను చిత్తుచిత్తుగా ఓడించాలని, తద్వారా వారికి బుద్ధి చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బీజేపీకి తాను ఒక్కటే చెప్పదల్చుకున్నానని, టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్దార్ అన్నారు. మీ కుట్రలు ఏ రాష్ట్రంలో అయినా చెల్లుతాయేమో కానీ ఏపీలో మాత్రం సాగవని చెప్పారు. విశాఖ నవ నిర్మాణ దీక్షలో మాట్లాడారు.
బీజేపీ, సహా విపక్షాల చెవుల్లో జనం పూవులు పెడతారన్నారు. రాజీనామాలపై వైసీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారన్నారు. ఉప ఎన్నికలు రాకుండా జగన్ కేంద్రంతో అవగాహన కుదుర్చుకున్నారని ఆరోపించారు. నవ్యాంధ్రపై మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. తనపై జగన్, పవన్ కళ్యాణ్ విమర్శలు అందులో భాగమే అన్నారు. బీజేపీతో అంటకాగే పార్టీలని ఓడించాలన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS