రేవంతూ నువ్వు రవ్వంత : ఒక్క నిప్పు రవ్వ చాలు నీ కొంప తగలబెట్టడానికి

Oneindia Telugu 2018-01-29

Views 2

Congress leader Revanth Reddy has questioned Telangana CM K Chandrasekhar Rao on power purchases.

తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు కొనుగోళ్లపై కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 24 గటల విద్యుత్తు వెలుగుల వెనక కెసిఆర్ చీకటి ఒప్పందాలున్నాయని ఆయన ఆరోపించారు. రైతుల కోసం ఎంతైనా విద్యుత్‌ కొనుగోలు చేస్తామనే హామీ వెనుక రైతులపై కెసిఆర్‌కు ప్రేమ లేదని, కమీషన్‌పై మాత్రమే ప్రేమ ఉందని ఆయన అన్నారు. ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్తు కొనుగోళ్ల వెనక ఆంతర్యమేమిటోప్రభుత్వం చెప్పాలని ఆయన అన్నారు.
తక్కువ ధరకే విద్యుత్‌ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా కెసిఆర్ ప్రభుత్వం మాత్రం ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందాలు చేసుకుందని, అవన్నీ కూడా కమీషన్ కోసమేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన, ప్రారంభించబోతున్న విద్యుత్ ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.విద్యుత్తు తక్కువ ధరకు అందించడానికి అనేక సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకు అధిక ధరలకు కొంటున్నారని రేవంత్ రెడ్డి అడిగారు. విద్యుత్ ఒప్పందాల కొనుగోళ్లను బయటపెట్టాలని కోరారు. అఖిలపక్షం నిర్వహించి విద్యుత్ కొనుగోళ్ల విషయం బయటకు చెప్పాలి. 24 గంటల విద్యుత్ కొనుగోళ్ల వెనుక అక్రమాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS