India registered their biggest win in T20 internationals after winning the first T20 at the Barabati Stadium in Cuttack on Wednesday by 93 runs. After posting a satisfactory 180 on board, the hosts tumbled Thisara Perera’s men for 87 to take a 1-0 lead in the three-match series.
కటక్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. బుధవారం రాత్రి శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ 93 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 100 పరుగులలోపే ఆలౌటైంది. 46 పరుగుల వరకూ కాస్త నిలకడగా ఆడిన లంక బ్యాట్స్మెన్లు ఆ తర్వాత వరుసగా పెవిలియన్ క్యూ కట్టారు. తరంగా(23), కుషల్(19), డిక్వెల్లా(13), చమీరా(12) మినహా మిగితా ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పెవిలియన్కు చేరారు. దీంతో శ్రీలంక 16 ఓవర్లు ముగిసేసరికి 87 పరుగులకే కుప్పకూలారు.
తాజా విజయంతో మూడు టీ20ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారత్ -శ్రీలంకకు మధ్య మ్యాచ్లు జరుగుతూనే ఉన్నాయి. ఫార్మాట్లు అయితే మారుతున్నాయి. కానీ, ఫైటింగ్ స్పీడ్ మారటం లేదు. భారత్ అదే దూకుడుతో దూసుకుపోతోంది. బుధవారం కటక్లోని బారాబతి వేదికగా జరిగిన టీ20ఫార్మాట్లో మళ్లి ఇంకోసారి చెలరేగిపోయింది. పాపం .. శ్రీలంక తొలి మ్యాచ్లోనే చతికిలబడింది.