JC Diwakar Reddy Warns PM modi

Oneindia Telugu 2017-12-01

Views 807

Telugu Desam Party MP JC Diwakar Reddy Make Sensational Comments on Centre over Polavaram Project on Thursday.

సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోలవరం ప్రాజెక్టు ఆపాలన్న కేంద్రం లేఖపై అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తున్నారు. బీజేపీ ఆకలితో ఉందని, ఆంధ్రప్రదేశ్‌ను కబలించాలని చూస్తోందని ధ్వజమెత్తారు.
ఆయన ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని ఆక్రమించాలని చూస్తోందని, దక్షిణాదిలో తమిళనాడుపై ఇటీవల కుయుక్తులు పన్నుతోందని, అలాగే ఏపీని కూడా కబళించాలని అనుకుంటోందని ధ్వజమెత్తారు.
ఏపీని కబళించాలనే ఉద్దేశ్యంతోనే అనవసర సమస్యలు సృష్టిస్తోందని విమర్శించారు. కేంద్రం చర్యలపై తమకు అనుమానాలు కలుగుతున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. చంద్రబాబును నియంత్రించాలనే ఒక దుర్బుద్ధి ఉందని తమకు అనుమానంగా ఉందని చెప్పారు. పోలవరం విషయంలో చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకొని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS