The Prime Minister’s Office was still to confirm that Prime Minister Narendra Modi would inaugurate the Hyderabad Metro Rail project.
మెట్రో రైలు ప్రారంభం గతంలో రెండుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయా? అంటే అవునని ప్రచారం సాగుతోంది. సాంకేతిక అవరోధాలు మెట్రోను వెంటాడుతున్నాయని అంటున్నారు. మెట్టుగూడ నుంచి ఎస్సార్ నగర్ వరకు మార్గానికి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ నుంచి అనుమతి రాలేదని, ప్రారంభోత్సవంపై ప్రధాని మోడీ నుంచి ఇంకా హామీ రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.
ఈ నెల 28వ తేదీన ఎలాగైనా మెట్రో రైలును ప్రారంభించాలనే పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం యుద్ధ ప్రాతిపదిన పనులు చేస్తోంది. అయినా పైరెండు అంసాలు తేలడం లేదు. దీంతో సందిగ్ధత నెలకొందని చెబుతున్నారు.