Indian women's cricket might have lost their match against Australia, but it was a special game for skipper Mithali Raj, who entered history books by creating two records.
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సహా ఎంతో మంది మిథాలీ రాజ్ ను ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. కోహ్లీ కూడా ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. అయితే, మిథాలీ రాజ్ ఫొటోను కాకుండా పొరపాటున మరో క్రికెటర్ పూనమ్ రౌత్ ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఆ తప్పును కోహ్లీ గ్రహించలేక పోయాడు. అభిమానులు ఈ తప్పిందంపై స్పందిస్తున్నప్పటికీ కోహ్లీ దాన్ని గ్రహించలేకపోయాడు. చాలా సేపటి వరకు ఆ ఫొటో అలానే ఉండిపోయింది. ఆ తర్వాత ఆ పోస్ట్ మొత్తాన్ని కోహ్లీ తొలగించాడు. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది.