Police Search for Gowtham Reddy : హత్యాయత్నం కేసులో తప్పించుకుని పారిపోయిన వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇంటిస్థలం కబ్జా కేసులో ఉమామహేశ్వరశాస్త్రిపై హత్యాయత్నం చేయించిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న గౌతంరెడ్డి దేశం విడిచి పారిపోకుండా ఇప్పటికే పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు.