Tirumala Srivari Brahmotsavam Simha Vahanam :తిరుమలలో కలియుగ వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు చిన్న శేషవాహనం, హంస వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ఇవాళ ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాల వేళ మూలమూర్తులు, ఉత్సవ మూర్తులను దర్శించుకొనేందుకు తరలి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో తిరుగిరులు మారుమోగుతున్నాయి.