తెలంగాణలోకి నో ఎంట్రీ.. ఏపీ నుంచి వస్తున్న ధాన్యం లారీలు వెనక్కి

Telugu Samayam 2022-04-14

Views 18

ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న ధాన్యం వాహనాలను సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు, రెవెన్యూ సిబ్బంది నిలిపివేశారు. మిల్లర్ల నుంచి తెలంగాణకు తరలిస్తున్న ధాన్యం వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వివరాలను నమోదు చేసుకొని లారీలను వెనక్కి పంపిస్తున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ధాన్యాన్ని ఆపడం ఏంటని ధాన్యం వాహనాల డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని అనుమతించబోమని తేల్చి చెప్తున్నారు. దీంతో చేసేదేం లేక లారీ డ్రైవర్లు వెనుదిరుగుతున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS