శిల్పాచౌదరి కేసులో కొత్త ట్విస్ట్

Webdunia Telugu 2021-12-06

Views 815

హైదరాబాద్ నగరానికి చెందిన శిల్పాచౌదరి కేసులో సరికొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా శిల్పా చౌదరిని పోలీసులు రెండు రోజుల పాటు తమ కష్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో రాధికా రెడ్డి అనే మహిళతో పాటు మరో మహిళ పేరును ఆమెను వెల్లడించారు. దీంతో రాధికా రెడ్డి హైదరాబాద్ నగర పోలీసులకు శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేశారు. శిల్పా చౌదరే తన వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ ఆధారాలతో సహా బయటపెట్టారు. దీంతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS