Govt releases 10th installment to states to meet GST compensation shortfall
#Telangana
#Andhrapradesh
#Cmkcr
#Ysjagan
#Gst
#GSTCompensation
జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు రావల్సిన రుణాలను కేంద్ర ప్రభుత్వం మరోసారి విడుదల చేసింది. పదో విడతగా రూ.6వేల కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం రుణంగా అందజేసింది. ఈ మొత్తంలో 23 రాష్ట్రాలకు రూ.5,516.60 కోట్లు విడుదల చేశామని, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.483.40 కోట్ల మొత్తాన్ని విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మిగిలిన ఐదు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, సిక్కింలకు జీఎస్టీ అమలు కాకపోవడంతో రుణాలు విడుదల చేయలేదు.