ఒకే రోజు 11 జెడ్‌ఎస్ ఎలక్ట్రిక్ కార్లను డెలివరీ చేసిన ఎంజి మోటార్స్

DriveSpark Telugu 2020-07-09

Views 91

ఎంజి మోటార్స్ కంపెనీ దేశీయ మార్కెట్లో తన ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టింది. ఎంజి మోటార్స్ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఉత్తమ మైలేజ్ ఇచ్చే వాహనాలలో ఇది కూడా ఒకటి.

2020 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో తర్వాత జెడ్ఎస్ ఇవి కారును డెలివరీ చేయడం ప్రారంభించిన ఎంజి మోటార్ కంపెనీకి ఉత్పత్తి, డిమాండ్‌కు అనుగుణంగా ఇప్పటివరకు 4,000 బుకింగ్‌లు వచ్చాయి. కేరళలోని కొచ్చిన్ లో ఒకే రోజు దాదాపు 11 కొత్త ఎంజి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్లు డెలివరీ చేసి కొత్త రికార్డ్ సృష్టించింది.

ఎంజీ మోటార్ కంపెనీ గతంలో జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్ మరియు హైదరాబాద్ లలో మాత్రమే విడుదల చేసింది. ఇటీవల కాలంలో కంపెనీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను కూడా కొంత వరకు పెంచింది. ఈ కారణంగా ఇప్పుడు జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలను ఆరు ప్రధాన నగరాలకు విస్తరించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS