A Cow Sad Incident in chittoor, Andhra Pradesh

Oneindia Telugu 2020-06-29

Views 32

A Cow Sad Incident in chittoor, Andhra Pradesh#KeralaElephant
#CowLivesMatter
#cow
#Chittoor
#AndhraPradesh
#ఆవు
#trolls
#నాటు బాంబు

ఇటీవల కాలంలో మూగ ప్రాణుల మీద జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయి. కొందరు ఉద్దేశపూర్వకంగానే అమానుషంగా ప్రవర్తిస్తుంటే.. మరికొందరు ఇతర కారణాలతో మూగ జీవాల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దపంజాని మండలం కోగిలేరు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వాహకులు గో పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ అటవీ వన్య మృగాల కోసం నీళ్లు, ఆహారాన్ని ఏర్పాటు చేసి వన్యప్రాణులకు ఆవాసంగా ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే, ఈ ప్రాంతంలో కొందరు అక్కడికొచ్చే వన్యప్రాణులను వేటాడేందుకు నాటు బాంబులను, తుపాకులను ఉపయోగిస్తున్నారు. కాగా, ఈ క్రమంలో గో పీఠానికి చెందిన ఓ ఆవు సదరు వేటగాళ్లు పెట్టిన నాటు బాంబును చూసింది. అయితే, అదేదో తినే పదార్థం అనుకుని నోటితో కొరికింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS