Telangana Elections 2018 : రాజకీయ అలజడి కోసమే కూకట్ పల్లి లో రంగంలోకి సుహాసిని...! | Oneindia Telugu

Oneindia Telugu 2018-11-19

Views 1

TRS Kukatpally MLA Candidates Madhavaram Krishna Rao Face to Face with Oneindia about Nandamuri Suhasini and Telangana Elections. And he told that he having good relations with Nandamuri family.
కూకట్‌పల్లి అభ్యర్ధిగా ఎన్టీఆర్‌ మనవరాలు సుహాసినీ పేరు టీడీపీ ఖరారు చేయడంతో ఒక్కసారిగా ఎన్నికల వాతావరణం మారిపోయింది. తెలంగాణ టీడీపీలో కొత్త ఉత్సాహం మొదలైంది. ఆమె పోటీ కారణంగా సెటిలర్స్‌ ఓటుతో పాటు స్థానికుల ఓట్లు టీడీపీకి గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో మసకబారిన టీడీపీకి ఇపుడు ఆమె కాంతిపుంజంలా కనిపిస్తోంది. సౌమ్యంగా, సింపుల్‌గా ఉన్న సుహాసినీ మాట తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెకు ఎన్టీఆర్‌ కుటుంబంమంతా బాసటగా ఉండడం గమనార్హం.
కాగా మరోపక్క మాధవరం కృష్ణారావు కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుహాసిని రాజకీయ ప్రవేశం నేపధ్యంలో మాధవరం కృష్ణారావు వన్ ఇండియా తో మాట్లాడారు. కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం లో పోటీ గురించి అయన మాటల్లోనే...
#TelanganaElections2018
#trs
#MadhavaramKrishnaRao
#NandamuriSuhasini
#congress
#Kukatpally

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS