శ్రీ రెడ్డి పై కేసు నమోదు చేసిన నటుడు వారాహి

Filmibeat Telugu 2018-07-24

Views 1

తమిళ చిత్ర పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న వివాదాస్పద నటి శ్రీరెడ్డికి చెన్నైలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఏఆర్ మురగదాస్, సుందర్ సీ, లారెన్స్ రాఘవపై సంచలన ఆరోపణలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డిపై తమిళ నటుడు వారాహి కేసు నమోదు చేశారు. తన ఫిర్యాదులో తీవ్రమైన ఆరోపణలు చేయడం గమనార్హం.
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ సినీ నటులు, ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసింది. కొందరిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నది. ఇప్పుడు అదే పద్దతిని తమిళ పరిశ్రమలో చేస్తున్నది. కావున శ్రీరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని వారాహి పోలీసులను కోరారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS