శ్రీదేవి మరణంతో బాలీవుడ్ షాక్ : ట్విట్టర్లో ప్రముఖుల సంతాపం!

Filmibeat Telugu 2018-02-25

Views 766

Bollywood fraternity has reacted with utter shock and total dismay after the shocking news of Sridevi’s sudden Passed out. The 54-year-old passed away after a massive cardiac arrest in Dubai.

ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణం బాలీవుడ్ చిత్రపరిశ్రమతో పాటు యావత్ భారత దేశాన్ని షాక్ కు గురి చేసింది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన ఆమె శనివారం అర్దరాత్రి గుండెపోటుకు గురై మరణించారు. శ్రీదేవి మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ శ్రీదేవి మృతిపై తనదైన శైలీలో స్పందించారు. ''దేవుణ్ణి ఈ రోజులా గతంలో ఎన్నడూ ద్వేషించలేదు. నా జీవితంలో అత్యంత పెద్ద వెలుగుని అతను తీసుకెళ్లిపోయాడు. బోనీ కపూర్‌కి నా ప్రగాఢ సానుభూతి'' అని ట్వీట్ చేశాడు.
గొప్ప నటి ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లి పోవడం బాధగా ఉంది అంటూ జాక్వెలిన్ ట్వీట్.
శ్రీదేవి మరణంపై ప్రియాంక చోప్రా స్పందించారు. మాటలు రావడం లేదంటూ ట్వీట్ చేశారు.
ఈ విషయం తెలియగానే నా గుండె ముక్కలైంది అంటూ కరీనా ట్వీట్.
శ్రీదేవి మరణంపై ట్విట్టర్ ద్వారా సుష్మితా సేన్,ప్రీతి జింతా,రితేష్ దేశ్ ముఖ్,మధుర్ బండార్కర్,స్పందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS