Fresh Update On Gujarat Exit Polls : ఇండియా టుడే సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?

Oneindia Telugu 2017-12-14

Views 880

The BJP will retain the government for the sixth consecutive time.However, Congress is expected to have a considerable voter share compared to previous elections.

గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికలు గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరిగింది. లైన్లో ఉన్న వారికి ఆ తర్వాత ఓటు వేసేందుకు అనుమతించారు. మొత్తం 182స్థానాలకు గానూ తొలి దశలో 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగగా.. రెండో దశలో 14జిల్లాలోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. - గుజరాత్‌లో రెండో దశ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. అయితే ఇప్పటికే క్యూలో నిలబడ్డ వారికి ఓటు వేసేందుకు అనుమతించారు.మధ్యాహ్నం 2గంటలకు వరకు 47.40శాతం ఓటింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ముగిశాయి. రెండు దశల్లో జరిగిన ఈ ఎన్నికలు 2019 ఎన్నికలకు ఎంతో కీలకంగా మారనున్నాయి. 182 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి.దాదాపు అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. ఏపీబీ సర్వే, ఇండియా టుడే సర్వే, న్యూస్ ఎక్స్ సర్వే..తదితర సర్వేలు బీజేపీ గెలుపు ఖాయమని చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండటంతో కమలం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS