BJP, TDP Leaders Protest at Telangana Assembly

Oneindia Telugu 2017-10-27

Views 13

BJP, TDP Leaders Protest at Telangana Assembly during telangana assembly sessions. Kishan Reddy protest along with farmers over trs failures.

టీడీపీ-బీజేపీ నేతల నిరసన @ ts అసెంబ్లీ !
కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీ ఒకపక్క వేడి పెంచుతుంటే, టీడీపీ-బీజేపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ గేటు వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల తో పాటు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదిక వర్షాలకు పంటలు పాడవడం గురించి, దానిమీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పంట నష్ట పరిహారం ఇవ్వాలంటూ కుళ్ళిపోయిన పాడైపోయిన పంటలను చేతుల్లో పట్టుకొని చూపిస్తూ నిరసన తెలుపుతూ అసెంబ్లీ లోపలికి వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. రైతుల సమస్యలపై చర్చను వెంటనే చేపట్టాలని, అక్రమ అరెస్టులను ఆపాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. మరిన్ని దేవాలయాలను గుర్తించి అర్చకులకు వేతనాలు ఇవ్వాలని కోరిన సభ్యులు కిషన్ రెడ్డి, అక్బరుద్దీన్‌లకు ధన్యవాదాలు చెబుతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS